News February 23, 2025
అమెరికా రాజకీయాల్లో తణుకు యువకుడు

అమెరికా రాజకీయాల్లో తణుకుకి చెందిన యువకుడు సత్తి ఆదిత్యరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల హోరా హోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ క్యాంపైన్ బృందంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు ఆర్మీ నేషనల్ గార్డ్గా పనిచేసిన ఆయన రిపబ్లిక్ పార్టీలో, ట్రంప్ ప్రభుత్వంలో అధికారిక హోదా పొందబోతున్నారు. వైట్ హౌస్లో జరిగే దాదాపు అన్ని కార్యక్రమాలకు ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
Similar News
News February 24, 2025
ప.గో: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు..కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పీజీఆర్ఎస్ నిర్వహించే తేదీని ప్రకటన ద్వారా తెలియచేస్తామని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.
News February 23, 2025
నరసాపురం నుంచి బైకుపై కుంభమేళాకు..

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు నరసాపురం వాసులు బైకుపై వెళ్లొచ్చామన్నారు. పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు చామర్తి రవి కుమార్, నాగేంద్ర బైక్పై రోజుకు 500కిమీ చొప్పున 3 రోజులు ప్రయాణించి ప్రయాగ్రాజ్కు వెళ్లారు. పవిత్ర స్నానం తర్వాత 18న బయల్దేరి 21న నరసాపురం వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ వెళ్లొచ్చినట్లు తెలిపారు.
News February 23, 2025
తాడేపల్లిగూడెం: డాక్టర్ నాగేశ్వరరావు మృతి

తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ డాక్టర్ కర్రి నాగేశ్వరరావు (84) వయోభారంతో శనివారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన అకాల మృతికి పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగేశ్వరావు భౌతిక కాయాన్ని పట్టణానికి చెందిన వైద్యులు, పలువురు ప్రముఖులతో పాటు సీనియర్ న్యాయవాది మాకా శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు ప్రభృతులు సందర్శించి నివాళులర్పించారు.