News March 28, 2024
అమెరికాలో బచ్చన్నపేట మండల వాసి మృతి
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్ నగర్కు చెందిన ఓ యువకుడు అమెరికాలో గుండె పోటుతో మృతిచెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. చిట్టోజు మదనాచారి, ప్రమీల దంపతుల కుమారుడు మహేశ్.. ఏడాదిన్నర క్రితం ఉద్యోగ రీత్యా అమెరికాలోని జార్జియాకు వెళ్లాడు. ఈక్రమంలో ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురికాగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. కాగా, మృతదేహం గ్రామానికి రావడానికి 5 రోజుల సమయం పడుతుంది.
Similar News
News October 6, 2024
GREAT.. జనగామ: ఒకే ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు
ఒకే ఇంట్లో అన్నా చెల్లెలు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బల్ల పద్మ-సోమయ్య కొడుకు మహేశ్ కుమార్, కూతురు మౌనికలు ఇటీవల విడుదలైన డీఎస్సీ(SGT) ఫలితాల్లో వరుసగా 5, 15వ ర్యాంక్లు సాధించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి బీడీలు చేసి వీరిని చదివించింది.
News October 6, 2024
మహాలక్ష్మి అలంకరణలో భద్రకాళి అమ్మవారు
ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో నాలుగో రోజు ఆదివారం భద్రకాళి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో ఆలయ అర్చకులు అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
News October 6, 2024
ఉగాండాలో జనగామ జిల్లా వాసి దారుణ హత్య
జనగామ జిల్లా వాసిని ఉగాండాలో హత్య చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. పట్టణానికి చెందిన తిరుమలేశ్ ప్రాజెక్ట్ ఇంజినీర్గా ఉగాండాలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నారు. అక్కడే పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు తాగిన మైకంలో తిరుమలేశ్పై కాల్పులు జరపడంతో ప్రాణాలు వదిలాడు. అనంతరం సెక్యూరిటీ గార్డు తనను తాను కాల్చుకొని మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.