News March 21, 2024

అమ్రాబాద్: యువకుడి సూసైడ్

image

అమ్రాబాద్ మండలానికి చెందిన ఎల్కచేను నీలమ్మ, నాగయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారైన స్వామి బుధవారం ఉదయం వ్యవసాయ పొలంలో టేకు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్థులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 11, 2025

దేవరకద్ర: తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతన్నలు

image

దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు నిమిత్తం మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. కాగా గురవారం కురిసిన వర్షంతో ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

News April 11, 2025

బాలానగర్: బావిలో దూసి మహిళ SUICIDE

image

బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుంది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. లింగారం గ్రామానికి జంగమ్మ (35)కు కల్లు తాగే అలవాటు ఉండగా ఆమెను భర్త మందలించాడు. మనస్థాపానికి గురైనా ఆమె అందరూ గాఢ నిద్రలో ఉండగా.. గురువారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

News April 11, 2025

ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహశీల్దార్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మఇంటి నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి తహశీల్దార్లకు పంపించాలన్నారు. 

error: Content is protected !!