News April 22, 2025

అర్జీలకు పరిష్కారం చూపండి: కలెక్టర్ ఆదేశం

image

ప్రజల అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. 

Similar News

News April 22, 2025

పోలీస్ కస్టడీకి గోరంట్ల మాధవ్

image

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు మొబైల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాధవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పోలీస్‌ సిబ్బందిపై దాడి కేసులో ఆయనను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News April 21, 2025

ఉమ్మడి అనంత జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి అనంత జిల్లాలో డీఎస్సీ ద్వారా 807 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.

➤ OC-314 ➤ BC-A:60 ➤ BC-B:75
➤ BC-C:9 ➤ BC-D:60 ➤ BC-E:29
➤ SC- గ్రేడ్1:20 ➤ SC-గ్రేడ్2:52
➤ SC-గ్రేడ్3:66 ➤ ST:49 ➤ EWS:73
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం<<16156843>> ఇక్కడ క్లిక్<<>> చేయండి.

News April 21, 2025

ATP: పోస్టులు 807.. పోటీ వేలల్లో..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీఎస్సీ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాకు 807 పోస్టులు మంజూరు కాగా టీచర్ ఉద్యోగాలకు సుమారు 40వేల మంది పోటీ పడనున్నట్లు సమాచారం. 202 ఎస్జీటీ పోస్టులకూ 24 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశముంది. దీంతో ఒక్కో టీచర్ పోస్టుకు సగటున 40 మంది, ఒక్కో ఎస్జీటీ పోస్టుకు 120 మందికిపైగా పోటీ పడాల్సిన పరిస్థితి ఉందని అభ్యర్థులు చెబుతున్నారు.

error: Content is protected !!