News March 19, 2025

అలంపూర్: బీఆర్ఎస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం

image

అలంపూర్ పట్టణంలో ఈరోజు బ్రాహ్మణ వీధి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ కొత్త కార్యాలయం ప్రారంభించినట్లు అలంపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరామయ్య శెట్టి తెలిపారు. గతంలో న్యూ ప్లాట్స్ కాలనీలో ఉండేదని అక్కడి నుంచి అలంపూర్ పట్టణానికి తరలించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు చిలుకూరి శ్రీనివాసులు, సింగిల్ విండో డైరెక్టర్ రమేశ్ గుప్తా తదితరులు ఉన్నారు.

Similar News

News March 20, 2025

నేడు వారికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు

image

TG: స్థానిక సంస్థల్లో కారుణ్య ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాల వారసులకు CM రేవంత్ నేడు నియామక పత్రాలను అందజేయనున్నారు. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో 582 మంది ఈ పత్రాలను అందుకోనున్నారు. జెడ్పీ, మండల పరిషత్తుల్లో ఉన్న 524 ఆఫీసు సబార్డినేట్, నైట్ వాచ్‌మెన్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేశారు. దీంతో పాటు 58 జూనియర్ అసిస్టెంట్ సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించారు.

News March 20, 2025

నేడు కుటుంబసమేతంగా తిరుమలకు సీఎం

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా నేడు తిరుమలకు వెళ్లనున్నారు. రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి ఒక్కరోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజున చంద్రబాబు ఫ్యామిలీ ఇదే పద్ధతి అనుసరిస్తోంది.

News March 20, 2025

తెలంగాణ అప్పులు రూ.5.04 లక్షల కోట్లు

image

TG: నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరం చివరి (మార్చి 2026) నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లు అని వెల్లడించారు. GSDPలో దీని వాటా 28.1% అని తెలిపారు. 2024-25లో తలసరి ఆదాయం రూ.3,79,751 అని, ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.2,05,579గా ఉందని పేర్కొన్నారు.

error: Content is protected !!