News April 15, 2025

అలంపూర్: లబ్ధిదారుల వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలని వినతి

image

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్‌కు వినతి పత్రాన్ని అందించారు. అలంపూర్, ఉండవల్లి, అయిజ, గద్వాల, ధరూర్ మండలాలతో పాటు ఇతర మండలాల నుంచి భారీగా దరఖాస్తులు ఉన్నాయని అధికారులకు విన్నవించారు. ఆయన వెంట దేవదాసు, నరసింహ ఇతరులు పాల్గొన్నారు.

Similar News

News December 13, 2025

రాహుల్ గాంధీతో ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఆయన హస్తినకు వెళ్తారు. ఓట్ చోరీ అంశంపై ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రేపు కాంగ్రెస్ నిర్వహించనున్న నిరసనలో సీఎం పాల్గొంటారు.

News December 13, 2025

కొండపి: తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు

image

కొండపి పొగాకు వేలంకేంద్రంలో కొనుగోళ్లు ముగిసినప్పటికీ రైతులకు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. సుమారు వేలం 9నెలల పాటు నిర్వహించడంతో పండించిన పొగాకు నాణ్యత కోల్పోయి ఆశించినంత మేర ధరలు రాక రైతులు నష్టాల బాట పట్టారు. బోర్డ్ అధికారులు రైతులకు సగటు ధర ఇప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో బ్యారర్‌కు రూ.2లక్షల పైబడి నష్టం వాటిలినట్లు రైతులు వాపోతున్నారు.

News December 13, 2025

15న విశాఖలో వైసీపీ కోటి సంతకాల ర్యాలీ: కేకే.రాజు

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమానికి పలు వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని జిల్లా అధ్యక్షుడు కేకే.రాజు అన్నారు. శనివారం YCP కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. డిసెంబర్ 15న GVMC గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లన్నున్నట్లు తెలిపారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం వినతి పత్రాలను తాడేపల్లికి ఆరోజు పంపనున్నట్లు చెప్పారు.