News February 16, 2025
అల్లూరి అనుచరులకు అపార్ట్మెంట్లు సిద్ధం

అల్లూరి వారసులకు కొయ్యూరు మండలం నడింపాలెం వద్ద డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్లు సిద్ధం అయ్యాయి. స్వాతంత్ర్య పోరాటంలో నాటి బ్రిటిష్ అధికారులను గడగడలాడించిన విప్లవవీరుడు అల్లూరికి కుడిభుజంగా పనిచేసిన గాం గంటన్నదొర, మల్లుదొరకు చెందిన 11 కుటుంబాలకు క్షత్రియ పరిషత్ వీటిని ₹3.5 కోట్లతో నిర్మించింది. వీటిని అల్లూరి జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ సోమవారం ప్రారంభిస్తారు.
Similar News
News March 15, 2025
ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం డీపీఓ కార్యాలయ సమీపంలో ఆటో, యాక్టివా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో గాయాలైన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యాక్టివా పైన ప్రయాణిస్తున్న ఇద్దరు 15 ఏళ్ల బాలురుల తో పాటు మరో వ్యక్తి శ్రీనివాస్కు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
News March 15, 2025
HYD: మారనున్న యూనివర్సిటీ పేరు.. హిస్టరీ ఇదే!

నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై నేడు సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టనున్నట్లు సమాచారం. కాగా సరిగ్గా నలభై ఏళ్ల క్రితం 1985లో తెలుగు యూనివర్సిటీని NTR ప్రారంభించారు. దీనికే 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా నామకరణం చేశారు.
News March 15, 2025
NZB: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టులు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.