News February 25, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ గంజాయి నిర్మూలనకు కృషి చేయండి: కలెక్టర్
➤ యూజీసీ నెట్లో అన్నవరం యువకుడి ప్రతిభ
➤ నిందితుల గుర్తింపునకు యాప్: రాజవొమ్మంగి ఎస్సై
➤ జాగ్రత్తలు తీసుకుని చికెన్ అమ్ముకోవచ్చు: రంపచోడవరం ఐటీడీఏ పీవో
➤ రహదారి సౌకర్యం కల్పించాలని అనంతగిరి గిరిజనుల పాదయాత్ర
➤ జీకే వీధి మండలంలో ఊరంతా ఏకమై రోడ్డు నిర్మాణం
➤ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అల్లూరి జిల్లాలో వైన్ షాపులు క్లోజ్
Similar News
News February 26, 2025
జపాన్ సకురాకు సంగారెడ్డి ప్రాజెక్టు.. కలెక్టర్ అభినందనలు

జపాన్ సుకూరాకు ఎంపికైన ఆందోల్ మండలం కన్సాన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి స్రవంతి, గైడ్ ఉపాధ్యాయుడు సిద్ధేశ్వరని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం సన్మానించారు. విద్యార్థిని తయారు చేసిన డిస్క్ లిఫ్టర్ ప్రాజెక్టు గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జపాన్ వెళ్లి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
News February 26, 2025
KMR: పది పరీక్షలు..ఎంత మంది రాయనున్నారంటే..?

పది పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసే పనిలో ఉంది. KMR జిల్లాలో పది వార్షిక పరీక్షలు 12,579 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందు కోసం 64 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు..ఐదుగురు రూట్, 22 మంది కస్టోడియన్స్, 22 జాయింట్ కస్టోడియన్స్, 11 మంది సీ సెంటర్ కస్టోడియన్స్, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్, 12 సిట్టింగ్ స్క్వార్డ్, 698 మంది ఇన్విజిలేటర్లను నియమించింది.
News February 26, 2025
ఆత్మహత్యల ‘కోటా’.. అడ్డుకట్టకు చర్యలు!

రాజస్థాన్లోని కోటాలో ఎన్ని చర్యలు చేపట్టినా విద్యార్థుల ఆత్మహత్యలకు <<14028051>>అడ్డుకట్ట<<>> పడటంలేదు. స్థానిక అధికారులు తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో హాస్టల్ యజమానులు ఏడాది మొత్తం ఫీజును ఒకేసారి వసూలు చేసేవారు. ఇకపై తొలుత రూ.2వేలు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పార్క్లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు.