News March 14, 2025
అల్లూరి: మహిళా టీచర్లు మాత్రమే అర్హులు

సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు సమన్వయకర్త స్వామి నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జడ్పి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిళ టీచర్లు అర్హులన్నారు. ఈనెల 13 నుంచి 19 వరకు దరఖాస్తులు తమ కార్యాలయంలో స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News March 15, 2025
తణుకు: పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ఫొటో

తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించి, స్వచ్ఛాంధ్ర కల సాకారం చేసుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన పరిసరాలను పరిశుభ్రం చేసి వారితో కలిసి ఫోటో దిగారు. ఈ పిక్ను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.
News March 15, 2025
కడెం: గ్రూప్-3 ఫలితాల్లో మెరిసిన తండా యువకుడు

గ్రూప్-3 ఫలితాల్లో కడెం మండలంలోని చిన్న బెల్లాల్ తండాకు చెందిన భుక్యా శశికుమార్ ప్రతిభ కనబరిచాడు. 306 మార్కులు సాధించి ఎస్టీ కోటాలో రాష్ట్రస్థాయి ఫస్ట్ ర్యాంక్, జనరల్ కోటాలో 58వ ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యమున-కిషన్ దంపతుల కుమారుడు శశికుమార్ గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. గ్రూప్-3లో ప్రతిభ కనబరిచిన శశి కుమార్ను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
News March 15, 2025
మెదక్: యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య

యువకుడు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ పట్టణం బారా ఇమాంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్కు చెందిన అరవింద్ (26) ఫతేనగర్లో ఉంటూ ఆర్టీసీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.