News April 1, 2024

అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి: కొప్పుల

image

ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలను పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఖండించారు. ఈ మేరకు రామగుండం సీపీ ఎం శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

Similar News

News March 1, 2025

ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

image

ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఆదిలాబాద్ వాసులు భయపడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఇవాళ, రేపు 36 °C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 1, 2025

ఆదిలాబాద్ ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

image

ఈనెల 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా..18,880 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఫస్ట్ ఇయర్లో 9,106 మంది, సెకండ్ ఇయర్ లో 9,774 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 2 సెట్టింగ్ స్క్వాడ్, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. వీరితోపాటు హైపవర్ కమిటీని నియమించారు.

News March 1, 2025

‘ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఎలాంటి పొరపాట్లు, కాపీయింగ్‌కు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం,అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు

error: Content is protected !!