News January 31, 2025

ఆ కారణంతోనే మాపై కేసులు: ఎంపీ మిథున్ రెడ్డి

image

రాజకీయ కక్షతోనే చంద్రబాబు తమపై కేసులు పెడుతున్నారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. మంగళంపేటలో 75 ఎకరాలు కొన్నామని, ఈ భూమి అటవీశాఖకు సంబంధించినది కాదని అన్నారు. తమ ఊర్లో హాస్పిటల్‌ నిర్మాణానికి రూ.15 కోట్ల విలువైన భూమిని ఇచ్చామని, అలాంటిది కేవలం రూ.3 కోట్ల భూమిని కబ్జా చేశామని చెప్పడం సరికాదన్నారు.

Similar News

News March 14, 2025

సంప్రదాయాలు పాటిస్తూ హోళీ జరుపుకోవాలి: కలెక్టర్

image

సంప్రదాయాలను పాటిస్తూ జరుపుకోవాలని ప్రజలకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సమానత్వానికి ప్రతీకని, ఈ రంగుల పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందించేలా మారాలని, ఆనందంగా, భద్రతతో, జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా హోలీ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. హోలీ ఆడిన తదుపరి బావులు, వాగులు, చెరువులు, గోదావరిలో స్నానాలకు వెళ్ళొద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.

News March 14, 2025

లింగంపేట: చెరువులో పడి మహిళ మృతి

image

చెరువులో పడి ఒక మహిళ మృతి చెందినట్లు లింగంపేట ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంబోజీపేట గ్రామానికి చెందిన కాశవ్వ గత నాలుగు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లిందన్నారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినట్లు తెలిపారు. గ్రామ శివారులోని చెరువులో ఆమె మృతదేహం లభించగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 14, 2025

సూర్యాపేట: మోదుగ పువ్వు.. చరిత్ర ఇదే..!

image

మోదుగ ఒక ఎర్రని పువ్వు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియాప్ర జాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా. ఇది ఒక పెద్ద చెట్టులాగా పెరుగుతుంది. అందమైన ఎర్రని పూలు గుత్తులు గుత్తులుగా అందంగా పూస్తాయి. మోదుగ చెట్టును కింశుక వృక్షం అని కూడా అంటారు. ఈ పువ్వులు హొలీ పండగ సమయంలో వేపుగా పూస్తాయి.

error: Content is protected !!