News March 21, 2025

ఆకివీడు: స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి

image

ఆకివీడు మండలం చిన కాపవరంలోని వయ్యేరు కాలువలో శుక్రవారం స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 5వ తరగతి చదువుతున్న పడికౌరు శరత్‌కుమార్ (10) కటారి పవన్ సాయి (10)లు మధ్యాహ్నం సమయంలో ఈతకొట్టేందుకు కాలువలోకి దిగారు. ఇద్దరు ఒక్కసారిగా కాలువలో మునిగిపోయారు. వీరి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Similar News

News March 22, 2025

ఆధార్ నమోదు ప్రక్రియపై శ్రద్ధ వహించాలి: కలెక్టర్ 

image

గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న వివిధ సర్వేలకు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులతో మాట్లాడారు. పెండింగ్ ఫైల్స్ పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్షించాలని, జిల్లాలో 10,748 వేల మంది పిల్లలు ఆధార్ నమోదు కాలేదని సత్వరమే ఆధార్ నమోదు ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు

News March 21, 2025

ప.గో జిల్లాలో ఉగాది పురస్కారాలకు ఎంపికైన అధికారులు

image

పశ్చిమగోదావరి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ HC అప్పారావు, DAR ARPC వెంకట రామకృష్ణ, పాలకొల్లు ఫైర్ ADFO జానకిరామ్, తణుకు టౌన్ PS HC నరసింహారాజు, జిల్లా ARSI నాగేశ్వరరావు. కొవ్వూరు డివిజన్ లోని ఉండ్రాజవరం PS ASI రామకృష్ణ, చాగల్లు PS ASI రాజేంద్రప్రసాద్‌లు ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారని అధికారులు తెలిపారు.

News March 21, 2025

ప.గో జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

image

ప.గో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా భీమవరంలో గురువారం 36.54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గణపవరంలో ఇవాళ దాదాపు 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!