News March 22, 2025

ఆకుల సేకరణకు వెళ్లి.. అనంత లోకాలకు..!

image

ఎటపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మడివి జ్యోతిలక్ష్మి(12) తునికి చెట్టు ఎక్కి ఆకుల సేకరణ చేస్తూ.. కింద పడి ఈనెల 17న గాయపడ్డారు. ఆమెను స్థానికులు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.

Similar News

News December 14, 2025

KMR: ఉత్కంఠ పోరు.. GP పీఠం కోసం నానా తంటాలు!

image

కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న 2వ విడత GP ఎన్నికలు పలు చోట్ల అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అత్యంత రసవత్తరంగా సాగుతున్న ఈ పోరులో అభ్యర్థులు విజయం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నదైనా, పెద్దదైనా గ్రామ పంచాయతీ పీఠాన్ని దక్కించుకోవడానికి అభ్యర్థులు చేస్తున్న ఖర్చు, అనుసరిస్తున్న వ్యూహాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

News December 14, 2025

INDvsSA.. గెలుపు ఎవరిదో?

image

టీ20 సిరీస్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా ఇవాళ టీమ్ ఇండియాతో దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్ ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో చెరో విజయంతో ఇరు జట్ల ఫోకస్ ఈ మ్యాచ్ నెగ్గడంపైనే ఉంది. రెండో T20లో నెగ్గిన సఫారీ ప్లేయర్లు అదే జోష్‌లో ఉన్నారు. అటు ఓటమితో కంగుతిన్న టీమ్ ఇండియా ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది. మ్యాచ్ 7pm నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News December 14, 2025

MBNR: ఈనెల 22 నుంచి “టీ-20 క్రికెట్ లీగ్”

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో ఈనెల 22 నుంచి 26 వరకు విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో జి.వెంకటస్వామి కాక మెమోరియల్ ఉమ్మడి జిల్లా టీ-20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్, NGKL, NRPT, GDWL, WNPT జట్లు పాల్గొంటాయని, ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుందన్నారు.