News March 16, 2025

ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యం: కిషన్ రెడ్డి

image

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో రాజీ పడవద్దని, చదువుతోనే పిల్లల భవిష్యత్​ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్​రెడ్డి అన్నారు. గాంధీనగర్​ సురభి బాలవిహార్​ స్కూల్​ దగ్గర SRK గ్రూప్​ ఆఫ్​ స్కూల్స్​ ఉదాన్​ ఉత్సవ్​–2025 కు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు.MLA ముఠా గోపాల్​, రిటైర్డ్​ ఐఏఎస్ అధికారి డా.బి.జనార్థన్​ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News March 18, 2025

బీసీ రిజర్వేషన్లకు BRS వ్యతిరేకం : మంత్రి సీతక్క

image

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు BRS మెుదటి నుంచి వ్యతిరేకంగా ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. ఉదయం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ప్రకటించి సాయంత్రం మాట మారుస్తోందని మండిపడ్డారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మైనార్టీ,ST రిజర్వేషన్లు పెంచలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆలోచనతో న్యాయనిపుణుల సలహాలతోనే కులగణన చేశామని తెలిపారు.

News March 18, 2025

సిరిసిల్ల: హాస్టల్ వార్డెన్ ఫలితాల్లో సత్తా చాటిన యువతి

image

వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన దార్ల జయ సోమవారం ప్రకటించిన హాస్టల్ వార్డెన్ ఫలితాల్లో రాజన్న జోన్‌లో 4వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం చందుర్తి మండలంలో కేజీబీవీలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూనే ఖాళీ సమయంలో డీఎస్సీ, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఫలితాల్లో సత్తా చాటింది. దార్ల లింగం, దేవా దంపతులు వ్యవసాయ కూలీ పని చేస్తు కుమార్తెను చదించారు.

News March 18, 2025

ఖమ్మం: ఇంటి వద్దకే రాములవారి తలంబ్రాలు: ఆర్ఎం

image

ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేసినట్లు ఖమ్మం RM సరిరామ్ తెలిపారు. దీనికోసం ఆన్లైన్ లేదా బస్టాండ్ సెంటర్లు మరియు ఏజెంట్ కౌంటర్ లో రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చున్నారు. మరిన్ని వివరాలకు ఖమ్మం :9154298583, మధిర :9154298584, సత్తుపల్లి:9154298585, భద్రాచలం:9154298586 కొత్తగూడెం&ఇల్లందు:9154298585, మణుగూరు: 9154298588 నంబర్లకు సంప్రదించాలన్నారు.

error: Content is protected !!