News April 13, 2025
ఆదిలాబాద్: 100వ పుట్టిన రోజు చేసుకున్న వృద్ధురాలు

ఓ వృద్ధురాలి వందేళ్ల పుట్టినరోజును ఆ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆదిలాబాద్లోని యాదవ సంఘ భవనంలో సరస్వతివార్ రుకుంబాయి 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుమార్తెలు, కుమారులు, మనమళ్లు, మనుమరాళ్లతో కలిసి దాదాపు 100 మంది కుటుంబీకుల మధ్య కేక్ కట్ చేశారు.
Similar News
News April 16, 2025
IPL: ఒకే ఓవర్లో 11 బంతులేశాడు

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ఆఖరి ఓవర్లో చెత్త ప్రదర్శన చేశారు. ఏకంగా 11 బంతులు వేయగా ఇందులో నాలుగు వైడ్లు, ఒక నోబాల్ ఉన్నాయి. సిక్సు, ఫోర్, నాలుగు సింగిల్స్ కలుపుకొని 19 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో IPLలో ఒకే ఓవర్లో 11 బంతులు వేసిన నాలుగో బౌలర్గా నిలిచారు. అంతకుముందు తుషార్ దేశ్ పాండే, సిరాజ్, శార్దూల్ కూడా ఓవర్లో 11 బంతులు వేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నారు.
News April 16, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ మాదక ద్రవ్య మోసాలపై QR కోడ్: కర్నూలు SP
➤ ఎమ్మిగనూరులో YCP నుంచి TDPలోకి చేరికలు
➤ కర్నూలు TDP కార్యాలయంపై దాడి.. నలుగురి అరెస్టు
➤ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం
➤ కోడుమూరు: ముగ్గురు వీఆర్వోలపై బదిలీవేటు
NOTE:- పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.
News April 16, 2025
అమరావతి భూసమీకరణ వెనుక కుట్ర: నాని

AP: అమరావతిలో మరో 44 వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించరని, త్వరలోనే అమరావతి మెగాసిటీ కుట్ర బయటకొస్తుందని పేర్ని నాని వెల్లడించారు.