News February 9, 2025
ఆదిలాబాద్: ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739019893393_50249255-normal-WIFI.webp)
అన్ని విషయాలు బోధించే ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఉపయోగించే విధానాన్ని తెలుసుకొని ఉండాలని, ప్రతి రోజు వాటిని ఉపయోగిస్తూ విద్యార్థులకు బోధన జరపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో ఆయా భాష ఉపాధ్యాయులకు ఐఎఫ్పిలు ఉపయోగించే విధానంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు చేశారు.
Similar News
News February 10, 2025
ఇండియన్ ఐడిల్లో ADB జిల్లా యువతి ప్రతిభ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739113953698_20476851-normal-WIFI.webp)
ఇండియన్ ఐడిల్ తో పాటు జీ తెలుగు వారు నిర్వహించిన సరిగమ సూపర్ సింగర్స్ ఫైనల్ పోటీల్లో ఆదిలాబాద్ యువతి మొదటి స్థానంలో నిలిచారు. అదిలాబాద్ భుక్తాపూర్ కాలనీకి చెందిన యువతి అభిజ్ఞ ఆదివారం జరిగిన ఫైనల్లో మొదటి స్థానంలో నిలిచి సత్తాచాటారు. దీంతో కౌన్సిలర్ బండారి సతీష్, కాలనీ వాసులు యువతికి అభినందనలు తెలిపారు.
News February 10, 2025
బాజీరావు మహారాజ్ బోధనలు ఆచరణీయం: రూపేశ్ రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739117524581_16876240-normal-WIFI.webp)
ఆధ్యాత్మిక గురువు బాజీరావు మహారాజ్ భౌతికంగా దూరమైన ఆయన బోధనలు ఆచరణీయమని, వేలాది మంది జీవితాల్లో ఆయన వెలుగులు నింపారని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్ రెడ్డి అన్నారు. బేల మండలంలోని చెప్రాల గ్రామంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న బాజీరావ్ మహారాజ్ సప్త వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో ఆయన హాజరై మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పల్లకిని గ్రామంలో ఊరేగించారు.
News February 9, 2025
కౌటాలలో పదో తరగతి విద్యార్థిని సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739080489034_1043-normal-WIFI.webp)
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కౌటాలలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ వివరాల ప్రకారం.. మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హనీస్ఫూర్తి స్టడీ మెటీరియల్ కోసం మొబైల్ ఫోన్ అడగ్గా తల్లి నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.