News February 4, 2025

ఆదిలాబాద్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

◾నార్నూర్ మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన.
◾గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి
◾ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి షాక్.. బరిలో మరో అభ్యర్థి
◾విషాదం.. విదేశంలో ఆదిలాబాద్ వాసి మృతి
◾అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
◾ప్రధానమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
◾మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు
◾ప్రభుత్వంపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఫైర్

Similar News

News February 5, 2025

కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్

image

కవ్వాల అభయారణ్యం పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల రాకపోకలను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు. రాకపోకలకు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాత్రి వేళల్లో రాకపోకలను అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వేటర్‌ను ఆదేశించారు. దీనిపై మంగళవారం HYDలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంత్రిని కలిశారు.

News February 5, 2025

ADB: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

image

అన్ని గురుకులాలలో 5-9 తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈనెల 6 వరకు ప్రభుత్వం పొడిగించిందని ఆదిలాబాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ లలిత కుమారి తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్‌లో నమోదుచేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్షలో కనబర్చిన ప్రతిభ విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలల ప్రాధాన్యత ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

News February 4, 2025

ADBలో రేపు 2 జాబ్‌మేళాలు

image

ADBలోని 1 టౌన్ PS ఎదుటనున్న ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్‌, శాంతినగర్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న జాబ్ మేళాలు జరగనున్నాయి. ఆర్ట్స్‌లో అప్ గ్రేడ్ ఆధ్వర్యంలో HDFC, AXIS బ్యాంక్, ముత్తూట్ ఫిన్ కార్ప్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేయనున్నారు. సైన్స్‌లో TSKC ఆధ్వర్యంలో TASK సహకారంతో MALE అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

error: Content is protected !!