News March 2, 2025

ఆదిలాబాద్: భార్య మందలించిందని భర్త SUICIDE

image

భార్య మందలించిందని ఓ భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు 2 టౌన్ ఏఎస్ఐ ముకుంద్ రావు తెలిపారు. మహారాష్ట్ర కిన్వాట్ తాలూకా దైహిలీకు చెందిన నూకల్వర్ ఓం ప్రకాశ్(35) మద్యానికి బానిస అయ్యాడు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందని భార్య మందలించింది. దీంతో శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News March 3, 2025

గుడిహత్నూర్: పురుగు మందు తాగి బాలిక సూసైడ్

image

గుడిహత్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యగూడ గ్రామానికి చెందిన గెడం వేదిక(16) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వెల్లడించారు.

News March 3, 2025

ఆదిలాబాద్: కౌంటింగ్ షురూ… అభ్యర్థుల్లో ఉత్కంఠ

image

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ జిల్లాలో ఇటీవ‌ల ప్ర‌శాంతంగా ముగిసింది. అయితే సోమవారం ఇందుకు సంబంధించిన ఫ‌లితాల ప్రక్రియ ప్రారంభమైన నేప‌థ్యంలో పోటీచేసిన అభ్య‌ర్థుల‌లో ఉత్కంఠ రేపుతోంది. ఎవ‌రి భవిత‌వ్యం ఎలా ఉండ‌బోతుందో తేలిపోనుంది. మొత్తం14935 మందికి గాను 10,396 మంది ఓటు వేయ‌గా 69.61 శాతం పోలింగ్ న‌మోదైంది. అలాగే టీచ‌ర్స్ 1,593 మంది ఉండ‌గా 1,478 మంది త‌మ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

News March 3, 2025

నేరడిగొండ: WOW.. ఇక్కడి ఆడపడుచులు GREAT

image

నేరడిగొండ మండలం మంగల్ మోట (తర్నం) గ్రామానికి చెందిన ఆడపడుచులు పేదింటి యువతి పెళ్లికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఆదివాసీ గ్రామాల్లో కట్న కానుకలను నిషేధిస్తూ ఆదివాసీలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి కట్న కానుకలు లేకపోవటంతో గ్రామంలో 60 కుటుంబాల ఆడపడుచులు కలిసి వారికి తోచినంత పొదుపు చేసుకొని రూ.12,342 ఆర్థిక సాయాన్ని అందజేశారు.

error: Content is protected !!