News February 26, 2025
ఆన్లైన్లో నిర్మాణ అనుమతులు: HYD మేయర్

ఫాస్ట్ డ్రాయింగ్ స్క్రూటినీ సిస్టమ్ కోసం అధునాతన సాంకేతికతతో కూడిన యూనిఫైడ్ సింగిల్ విండో సిస్టమ్ బిల్డ్స్ అందుబాటులోకి తెస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆర్కిటెక్చర్, ఇంజినీర్లకు బిల్డ్స్ డీసీఆర్పై ఏర్పాటు చేసిన శిక్షణను కమిషనర్ ఇలంబర్తితో కలిసి ఆమె ప్రారంభించారు. ఆన్లైన్లోనే తమ నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Similar News
News February 26, 2025
నిమ్మనపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

ఒడిశా రాష్ట్రానికి చెందిన పొదన్, దీపక్లు ఎగువ మాచిరెడ్డిగారిపల్లె వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. బుధవారం ఇటుకుల బట్టి నుంచి ఇటుకులను లోడ్ చేసుకుని బోయకొండ వద్ద అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ పరారు కాగా, పొదన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై తిప్పేస్వామి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు.
News February 26, 2025
కేంద్రం-రాష్ట్రం వివాదం పిల్లల కొట్లాటలా ఉంది: విజయ్

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ విషయంలో తమిళనాడుకు, కేంద్రానికి మధ్య వివాదం చిన్నపిల్లల కొట్లాటలా ఉందని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఎద్దేవా చేశారు. పాలసీ అమలు చేయకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.2,400 కోట్లు నిలిపివేస్తామనటం అన్యాయమన్నారు. TVK పార్టీ వార్షికోత్సవ సభలో విజయ్ ప్రసంగించారు. BJP, DMK పార్టీలను ‘గెట్ఔట్’ హ్యష్ట్యాగ్ పెట్టి సాగనంపాలని పిలుపునిచ్చారు.
News February 26, 2025
WGL: ఈనెల 27న డయల్ యువర్ డీఎం కార్యక్రమం

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్-1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు. ఈనెల 27న ఉ.9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రయాణికులు 9959226047 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు, సలహాలు, సూచనలు తెలపాలని కోరారు.