News February 10, 2025

ఆర్మూర్ రానున్న త్రిపుర గవర్నర్

image

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆర్మూర్ పట్టణానికి రానున్నట్లు BJP సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బాసరలో మహా జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మామిడిపల్లిలోని వెంకటేశ్వర స్వామి వారిని, సిద్ధుల గుట్ట సిద్ధేశ్వరుడిని దర్శించుకొనున్నారు. BJP సీనియర్ నాయకులు భూపతి రెడ్డి స్వగృహానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లిన అనంతరం బాసరకు బయలుదేరుతారు.

Similar News

News December 19, 2025

TU: డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్

image

టీయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్ ఇచ్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016 నుంచి 2020 వరకు విద్యనభ్యసించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల విద్యార్థులు 1,2,3,4,5,6 సెమిస్టర్ పరీక్షలు రాసుకోవచ్చు అని వెల్లడించారు. జనవరి 3 లోపు ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.

News December 19, 2025

NZB: ఆదివారం కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు: TPCC చీఫ్

image

జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరు ను తొలగించి వికసిత్ భారత్ జి.రామ్.జి పేరు తో కొత్త పథకాన్ని తెస్తూ BJP చేస్తున్న కుట్రలను నిరసిస్తూ AICC పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. జిల్లాలో ఆదివారం కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.

News December 19, 2025

NZB: రేషన్ కార్డు… E-KYCపూర్తి చేసుకోండి: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుదారులు తమ వేలిముద్ర సహాయంతో E-KYC పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో మొత్తం 467295 కార్డుల్లోని 1572176 మంది లబ్దిదారులకు గాను 1103928 (70.22%) లబ్దిదారులు మాత్రమే E-KYC పూర్తిచేసుకున్నారని, మిగతా 468251 (29.78%) లబ్దిదారులు సమీపంలోని తమ రేషన్ షాప్ కు వెళ్లిE-KYC పూర్తిచేసుకోవాలన్నారు.