News July 14, 2024

‘ఆలూరులో టీడీపీని బతికించండి’

image

ఆలూరు నియోజకవర్గంలో చతికిలపడ్డ టీడీపీని బతికించాలని శనివారం నియోజకవర్గానికి చెందిన నేతలు అధిష్ఠానానికి విన్నవించారు. అధినేత చంద్రబాబు, లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసును కలిసి పలు విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వీరభద్ర గౌడ్ స్థానిక నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లకపోవడం వల్లే 2024 ఎన్నికల్లో ఓటమి చెందారని, ఈయన స్థానంలో కొత్త ఇన్‌ఛార్జిని నియమించాలని కోరినట్లు వారు తెలిపారు.

Similar News

News October 7, 2024

కర్నూలు: కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి భారీ కుంభకోణం?

image

కర్నూలు కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి చేతివాటం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కాగా ఆయన ప్రస్తుతం వేరే ప్రాంతానికి బదిలీ అవ్వగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఆయన ఆలయం పేరిట సొంత ఖాతా తెరచి రూ.1.30 కోట్లు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. బినామీలు, సిబ్బంది పేరిట డబ్బులు విత్ డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News October 7, 2024

నందికొట్కూరు: రూ.100కి చేరిన టమాటా

image

నందికొట్కూరులో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధర అమాంతం పెరిగింది. హోల్సేల్ మార్కెట్లో టమోటా ధర రూ.70 -80 పలుకుతోంది. నందికొట్కూరు సంత మార్కెట్ లో సోమవారం రిటైల్ మార్కెట్లో టమాటా ధర రూ.100 దాటిందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధర కూడా రూ.70- 80 కి చేరిందన్నారు.

News October 7, 2024

డోన్‌: హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

image

డోన్‌లోని కొండపేట వాసి షేక్ మదార్‌వలిపై గతనెల17న హత్యాయత్నం చేయగా కర్నూలులో చికిత్స పొందుతూ 26వ తేదీ మృతి చెందారు.ఈ కేసుకు సంబంధించి వ్యక్తిని కొట్టి చంపిన ఐదుగురిని రిమాండ్‌కి పంపినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. వారిని గుత్తిరోడ్డులోని మార్కెట్ యార్డ్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశామన్నారు. హరికృష్ణ, చెన్నకేశవులు, రంగమని, మౌలాలి, శివసాయి కలిసి వలిని కర్రలతో, రాడ్లతో కొట్టినట్లు సీఐ తెలిపారు.