News February 8, 2025
ఆలేరు: బస్సులో కండక్టర్ పుస్తెలతాడు చోరీ..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738933906501_51989433-normal-WIFI.webp)
జనగాం నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ వెళ్లే బస్సులో పుస్తెలతాడు అపహరించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జనగాం డిపోకు చెందిన TS27Z0028 నంబర్గల బస్సులో మహిళా కండక్టర్ ఉమామహేశ్వరికి చెందిన సుమారు మూడు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై మహేశ్వరి ఆలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 8, 2025
కరీంనగర్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738982381357_1259-normal-WIFI.webp)
పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూరాబాద్లోని ఇందిరానగర్లో జరిగింది. పోలీసులా కథనమిలా.. గ్రామానికి చెందిన కోలుగోరి సుజిత్ (30) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంగీకరించకపోవడంతో పురుగు మందు తాగాడు. ఈ క్రమంలో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
News February 8, 2025
శైలజానాథ్కు కీలక పదవి ఇస్తారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738982279308_727-normal-WIFI.webp)
పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఆ పార్టీ జిల్లా శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఎన్నికలకు మరో 4ఏళ్ల సమయం ఉండగా, కష్ట కాలంలో YCP తీర్థం పుచ్చుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పార్టీకి ఆయన అదనపు బలం అని భావిస్తున్నాయి. మరోవైపు శైలజానాథ్కు జగన్ కీలక పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
News February 8, 2025
అనకాపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738974617635_19090094-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.