News March 1, 2025
ఆల్ ది బెస్ట్.. పరీక్షలు బాగా రాయండి: మంత్రి సత్యకుమార్

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ వెంట ఉంటాయని ట్వీట్ చేశారు. నిబద్ధత, క్రమశిక్షణ, అభ్యాసం ద్వారా ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News March 1, 2025
అక్కా.. అని పిలిచి అత్యాచారం

పుణే రేప్ కేసు <<15605696>>నిందితుడు<<>> దత్తాత్రేయ గడేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే ఘటన జరిగిన రోజు తె.జామున యువతి స్వార్గేట్ బస్టాండ్లో నిల్చొని ఉండగా గడే ఇన్షర్ట్ వేసుకొని వచ్చాడు. ‘దీదీ(అక్కా) మీ బస్సు పక్కన నిలిపి ఉంది’ అని తీసుకెళ్లాడు. బస్సులో లైట్లు ఆన్ చేయలేదేంటని ఆమె ప్రశ్నించగా ప్రయాణికులు నిద్రపోతున్నట్లు చెప్పాడు. ఆమె అందులోకి ఎక్కగానే డోర్ లాక్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
News March 1, 2025
ఆఫీసులో ఎన్ని గంటలు ఉన్నారన్నది ముఖ్యమే కాదు: ఆకాశ్ అంబానీ

ఆఫీసులో రోజూ ఎన్ని గంటలు గడిపామన్నది కాదు ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నదే ముఖ్యమని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. ముంబై టెక్ వీక్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ‘ఎన్ని గంటలు, ఎంత టైమ్ ఉన్నారని నేను ఆలోచించను. రోజూ ఎంత క్వాలిటీ వర్క్ చేశారన్నదే ముఖ్యం. Growth is Life అన్నదే రిలయన్స్ మోటో. ఇది వ్యక్తిగత జీవితానికీ వర్తిస్తుంది. అంటే మనం ప్రతిరోజూ ఎదుగుతూనే ఉండాలి’ అని పేర్కొన్నారు.
News March 1, 2025
HYD: సెలబ్రిటీలను మోసం చేసిన యువకుడిపై మరో కేసు నమోదు

గతంలో జూబ్లీహిల్స్ PS పరిధిలో సెలబ్రిటీలు, సంపన్నులను SustainKart పేరుతో మోసం చేసిన ఘటనలో జైలుకెళ్లి వచ్చిన కాంతి దత్పై తాజాగా CCSలో మరో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు తీసుకొని మోసగించినట్లు సౌజన్య అనే మహిళ ఫిర్యాదు చేసింది. తృతీయ జ్యువెలరీ పేరుతో తిప్పల శ్రీజ అనే మహిళను మోసగించిన ఘటనలో కాంతి దత్ గతంలో అరెస్టయ్యాడు. తాజాగా మరో కేసు నమోదు కావడం గమనార్హం.