News March 17, 2025

ఆసిఫాబాద్ జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. నిరుద్యోగులు tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. వివరాలకు ఐటీడీఏ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

Similar News

News March 17, 2025

మెదక్: ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల: DEO

image

ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రెండు సమయాల్లో కొనసాగుతాయని వివరించారు. అలాగే ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధం కావాలని సూచించారు. సందేహాలు ఉంటే సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News March 17, 2025

నల్గొండ: ట్రాక్టర్ టైర్ కింద పడి డ్రైవర్ దుర్మరణం

image

బోయినపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కడారి వెంకన్న యాదవ్ (48 ) సోమవారం ప్రమాదవశాత్తు ట్రాక్టరు మధ్య టైర్ కింద పడి తీవ్ర గాయాలతో దుర్మరణం చెందాడు. ట్రాక్టర్లో ఇసుక లోడ్ చేసుకుని నల్గొండకు తరలిస్తున్నాడు.  ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ డోరు లూజు కాగా దానిని సరిచేసి ట్రాక్టరు డ్రైవింగ్ సీట్లోకి ఎక్కుతున్న క్రమంలో కాలుజారి టైరు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.

News March 17, 2025

పార్వతీపురం: పది పరీక్షలకు 10,308 మంది హాజరు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో తొలిరోజు 10వ తరగతి పరీక్షలకు 10,308 మంది విద్యార్థులు హాజరైనట్లు కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 10,355 మంది విద్యార్థులకు గాను 10,308 మంది విద్యార్థులు హాజరుకాగా 47 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పట్టణంలోని సెయింట్ పీటర్స్ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.

error: Content is protected !!