News February 25, 2025
ఇంటర్ పరీక్షలుసజావుగా నిర్వహించాలి- కలెక్టర్

ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అధికారులకు సూచించారు. మంగళవారం అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 1 నుంచి నిర్వహించే ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Similar News
News February 26, 2025
SRPT: ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: SP

ఈనెల 27న జరగనున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఎన్నికల సామాగ్రి రక్షణ, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రణాళిక ప్రకారం విధులు నిర్వర్తించాలని పోలీసు సిబ్బందికి, అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మొత్తం 23 బూత్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News February 26, 2025
హనుమకొండ: మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: డీసీపీ

హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఫిబ్రవరి నెలలో నమోదైన 9 గంజాయి కేసులతో పాటు గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు.
News February 26, 2025
NLG: పెరుగుతున్న టెంపరేచర్.. కలెక్టర్ సమీక్ష

ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం తన చాంబర్లో వడదెబ్బపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, అందువల్ల వడదెబ్బ గురి కాకుండా అవగాహన కల్పించాలన్నారు.