News March 22, 2024
ఇంటి వద్దే ఓటుహక్కు వినియోగానికి దరఖాస్తుల స్వీకరణ
నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అర్హత కలిగిన వారు మొత్తం 43,326 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 22,992 మంది, మహిళలు 20,330 మంది ఉన్నారు. వీరిలో దివ్యాంగ ఓటర్లు 33,839 మంది.. 85ఏళ్లు పైబడిన ఓటర్లు 9,487 మంది ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ఓటర్లు మాత్రమే ఫారం-12డీ ద్వారా నేటి నుంచి దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి.. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అనుమతిస్తారు.
Similar News
News September 29, 2024
చెన్నారం గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బుగ్గ తండాకు చెందిన భీముడు (23), రమేష్(8)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 29, 2024
NLG: ఎటు చూసినా ధరల మోతే
నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు ముండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరల మోత మోగుతుంది. ఏ కూరగాయ చూసినా పావు కేజీ రూ.40 నుంచి రూ.60 పలుకుతోంది. జిల్లాలో రైతులు కూరగాయల సాగు వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో కూరగాయలను ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News September 29, 2024
NLG: నల్గొండకు కావాలి హైడ్రా!
నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినా అక్రమార్కుల్లో భయం కనిపించడం లేదు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర మండలాల్లో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో ఫ్లాట్లు ఏర్పాటుచేసి విక్రయించినట్లు తెలుస్తోంది. అధికారులు వీటిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.