News April 25, 2024

ఇండియన్ రైల్వేస్‌లో సెకండ్ బెస్ట్ లోకో షెడ్‌గా గుత్తి

image

ఇండియన్ రైల్వేస్‌లోని డీజిల్ లోకో షెడ్ నందు త్రీ ఫేజ్ జీ-9 ఎలక్ట్రికల్ ఇంజిన్ల నిర్వహణలో గుత్తి లోకో డీజిల్ షెడ్ సెకండ్ బెస్ట్ డీజిల్ షెడ్‌గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జై షీల్డ్ బహుకరించారు. గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ రమేష్ షీల్డ్ అందుకున్నారు.

Similar News

News April 23, 2025

10th Results: 23వ స్థానంలో అనంతపురం జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 30,700 మంది పరీక్ష రాయగా 21,510 మంది పాసయ్యారు. 15,733 మంది బాలురులో 10,315 మంది, 14,967 మంది బాలికలు పరీక్ష రాయగా 11,195 మంది పాసయ్యారు. 70.07 పాస్ పర్సంటైల్‌తో అనంతపురం జిల్లా 23వ స్థానంలో నిలిచింది.

News April 23, 2025

అనంతపురం జిల్లాలో ఉద్యోగాలు.!

image

అనంతపురం జిల్లా శింగనమల KGBVలో ఖాళీ పోస్టులకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు. KGBVలోని టైప్-3 హస్టల్‌లో ఉన్న ఖాళీలను MEO నరసింహ రాజు వివరించారు. KGBV-3లో హెడ్ కుక్-1 పోస్ట్, అసిస్టెంట్ కుక్-3 పోస్టులు, వాచ్‌మెన్-1 ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా టైప్‌-4లో చౌకీదార్-1, హెడ్ కుక్-1, అసిస్టెంట్ కుక్-1 ఖాళీగా ఉన్నాయి. ఈనెల 30లోగా మహిళలు ఈ పోస్టులకు శింగనమల MEO కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 23, 2025

అనంత: రైలు చైన్ లాగారంటే.. మెడలో చైన్ ఊడినట్లే.!

image

సురక్షిత ప్రయాణాలు చేయాలనుకునే వారు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అలాంటిది రైలు ప్రయాణాలంటే బయపడాల్సిన పరిస్థితి వచ్చింది. రైలు నిర్మానుష్య ప్రాంతంలో ఆగిందంటే మహిళల మెడల్లో చైన్ చోరీ జరిగినట్లే.  ఇటీవల గుంతకల్లు- తిరుపతి రూట్ ఔటర్‌లో నిలిచిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో, శ్రీ సత్యసాయి జిల్లాలోనూ 2 వరుస చోరీలు జరిగాయి. అధికారులు ఇలాంటి చర్యలపై నిఘా పెట్టాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు.

error: Content is protected !!