News July 4, 2024

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం

image

వేంపల్లె(M) ఇడుపాలపాయలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. బుధవారం రాత్రి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయి లోనికి తీసుకెళుతుండగా మెుయిన్ గేటు వద్ద సెక్యూరిటీకి పట్టుబడ్డారు.అధికారులు గురువారం కోర్ కమిటీ సమావేశం నిర్వహించి ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొపెసర్ ఏవీఎస్ కుమారసవామి వారికి టీసీ ఇచ్చినట్లు తెలుస్తుంది. గంజాయి ఎక్కడ నుంచి తీసుకొచ్చారనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం.

Similar News

News October 6, 2024

కడప నగరంలో కారు బోల్తా

image

బిజీగా ఉండే కడప నగరంలోని అప్సర సర్కిల్ వద్ద కారు బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన ఓ కారు అప్సర సర్కిల్ వద్ద బోల్తా పడింది. విషయం తెలుసుకున్న చిన్న చౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫల్టీ కొట్టిన కారును పరిశీలిస్తున్నారు. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయాలు తెలియాల్సిఉంది.

News October 6, 2024

YVU: సెలవులున్నా.. పరీక్షలు యథాతథం

image

కడప యోగి వేమన విశ్వవిద్యాలయానికి నేటి నుంచి ఈనెల 13 వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 14వ తేదీన తరగతులు తిరిగి మొదలవుతాయి. BL, LLB సెమిస్టర్‌ పరీక్షలు ముందుగా సూచించినట్లు ఈనెల 8, 10వ తేదీల్లో యథావిధిగా కొనసాగనున్నాయి. ఏపీఐసెట్ స్పాట్ అడ్మిషన్లు వైవీయూలో 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

News October 5, 2024

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

image

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియమించడం పట్ల రాచమల్లు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.