News April 3, 2025

ఇఫ్కో సెజ్‌ అభివృద్ధిపై ఎంపీ వేమిరెడ్డి భేటీ

image

నెల్లూరూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురువారం ఇఫ్కో సీఈవో ఉదయ్‌ శంకర్‌ అవస్థిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనతో వివిధ అంశాలపై కూలంకుశంగా చర్చించారు. కొడవలూరు మండల పరిధిలో ఉన్న ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో పరిశ్రమలు స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ పరిశ్రమలు వస్తే జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని MP వివరించారు.

Similar News

News April 10, 2025

నెల్లూరు జిల్లాలో దారుణం

image

నెల్లూరు జిల్లా ఊటుకూరు పెద్దపట్టపుపాళెంలో దారుణం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వరకట్నం కోసం సుగుణమ్మను వివస్త్రని చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ దాడి చేశారు. ఈ విషయం బయటకొస్తుందని ఆపై కొట్టి చంపేశారు. కళ్లాపి రంగు తాగి ఆత్మహత్య చేసుకుందని హైడ్రామా సృష్టించారు. భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్, నర్సమ్మ, ఆడబిడ్డ నాగలక్ష్మి పరారయ్యారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

News April 10, 2025

NLR: నోషనల్ ఖాతాలుగా మార్చేందుకు చర్యలు

image

నెల్లూరు జిల్లాలో భూముల నోషనల్ ఖాతాలను మార్పు చేసుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఆర్వో ఉదయ భాస్కర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భూముల్లో రైతులకు సంబంధించిన రికార్డుల్లో నోషనల్ ఖాతాల నమోదు, వివాదాలు లేని పట్టా భూములకు రెగ్యులర్ నోషనల్ ఖాతా ఇవ్వడానికి ఈనెల 16వ తేదీలోగా తహశీల్దార్, ఆర్డీవోలకు తగిన రికార్డులు సమర్పించాలని సూచించారు.

News April 10, 2025

గుంటూరులో నెల్లూరు మహిళపై దాడి

image

గుంటూరులో నెల్లూరుకు చెందిన మహిళపై దాడి జరిగింది. అక్కడి RTC బస్టాండ్ వద్ద నెల్లూరు మహిళ వ్యభిచారం చేస్తోంది. ఆమెతో బేరం మాట్లాడుకున్న ఓ వ్యక్తి గుంటూరు మణిపురం బ్రిడ్జి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న మరో ముగ్గురితో కలిసి ఆమెపై దాడి చేశారు. రూ.1000 లాక్కొని పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు.

error: Content is protected !!