News February 19, 2025
ఇలా చేస్తే మీ ఓటు చెల్లుబాటు కాదు: బాపట్ల కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు అత్యంత జాగ్రత్తగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జి. వెంకట మురళి చెప్పారు. ఓటర్లు ప్రథమ ప్రాధాన్యత ఓటును నమోదు చేయనట్లయితే వారి ఓటు చెల్లుబాటు కాదన్నారు. మంగళవారం ఓటింగ్ విధానంపై ఎన్నికల నిఘావేదిక వారు ప్రచురించిన కరపత్రాలను ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఓటును అంకెలలో కాకుండా అక్షరాలలో నమోదు చేసినా కూడా ఆ ఓటు చెల్లుబాటు కాదన్నారు.
Similar News
News December 15, 2025
సీడ్ పార్కు… 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలు

TG: విత్తన ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చేలా ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా సీడ్ రీసెర్చ్ పార్కు నెలకొల్పనుంది. అలాగే కొత్తగా 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 25 లక్షల టన్నుల అధిక నాణ్యత గల విత్తనాలను ఉత్పత్తి చేయనుంది. ఎగుమతి కోసం ‘Inland seed Export facilitation port’నూ నెలకొల్పనున్నట్లు TG రైజింగ్ డాక్యుమెంట్లో తెలిపింది.
News December 15, 2025
పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శం: మంత్రి ఫరూక్

పొట్టి శ్రీరాములు త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని మంత్రి ఫారుక్ పేర్కొన్నారు. వర్ధంతి సందర్భంగా నంద్యాల సంజీవనగర్ గేటులోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆయనే కారణమని మంత్రి తెలిపారు. పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని కొనియాడారు.
News December 15, 2025
సింహాచలంలో డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

సింహాచలంలో డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో సుజాత తెలిపారు. డిసెంబర్ 20 నుంచి 29 వరకు ఆలయంలో అన్ని అర్జీత సేవలను రద్దు చేశామన్నారు. డిసెంబర్ 30 నుంచి JAN 9 వరకు సహస్రనామార్చన రద్దు, రాత్రి 7 గం.ల వరకు మాత్రమే దర్శనాలు కల్పించనున్నారు. JAN 11న కూడారై ఉత్సవం సందర్భంగా ఉ.9 నుంచి 10:30 వరకు దర్శనాలు నిలిపివేశారు. JAN 16 నుంచి 19 వరకు ఆరాధన, సుప్రభాత సేవ టికెట్లు రద్దు చేశారు.


