News August 6, 2024
ఇళ్ల స్థలాల పంపిణీలో భారీ అవినీతి: SVSN వర్మ
పిఠాపురంలో గత ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన సెంటు భూమి స్థలాలను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జి SVSN వర్మ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునిగిపోయే స్థలాలను రూ.కోట్లల్లో కొని ప్రజలకు కేటాయించారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇళ్ల స్థలాల పంపిణీలో భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.
Similar News
News October 7, 2024
మంత్రి నాదెండ్లను కలిసిన పౌరసరఫరాల శాఖ మెంబర్ మోకా
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ మెంబర్గా పదవి బాధ్యతలు చేపట్టిన పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో-కన్వీనర్ మోకా ఆనంద సాగర్ అమరావతిలోని సచివాలయం వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన మోకా ఆనంద్ సాగర్ను మంత్రి అభినందించారు. అదేవిధంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
News October 7, 2024
రంపచోడవరం: CRPF జవాన్ మృతి
చింతూరు మండలంలో విషాదం జరిగింది. వేటగాళ్లు పెట్టిన విద్యుత్ వైర్లు తగలడంతో సీఆర్పీఎఫ్ జవాను తిరువాల కారాసు (55) ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలు.. డొంకరాయి పరిసరాల్లో రాత్రి 2 గంటలకు కూంబింగ్ విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 7, 2024
ధవళేశ్వరం బ్యారేజీ UPDATE
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 1.62 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని తెలిపారు.