News April 9, 2025

ఈనెల 16న జడ్పీ సర్వసభ్య సమావేశం: సీఈవో

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ కార్య నిర్వాహక అధికారి నారాయణమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 19, 2025

పెద్దపల్లిలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

image

పెద్దపల్లి జిల్లాలో అంతర్రాష్ట్ర ATM దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీపీ కరుణాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దొంగలు రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములుగా గుర్తించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు నిఘా పెంచి గాలించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

News April 19, 2025

ములుగు: ఆ స్వామి నాభి చందనం సేవిస్తే.. సంతానం కలుగుతుంది!

image

తెలంగాణలోనే 2వ యాదగిరిగుట్టగా పిలుచుకునే మంగపేట మండలం మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 6వ శతాబ్దంలోని చోళ చక్రవర్తుల కాలంనాటి నుంచే ఈ ఆలయం ఉన్నట్లు చెబుతుంటారు. స్వామి వారి బొడ్డు నుంచి కారే ద్రవం(నాభి చందనం)కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ద్రవం సేవిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఎంతోమందికి సంతానం కలిగిందని ఇక్కడి అర్చకులు చెబుతుంటారు.

News April 19, 2025

కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

కూసుమంచిలోని హైస్కూల్ ఎదురుగా రెండు రోజుల క్రితం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన పోచారం గ్రామానికి చెందిన ఇందుర్తి శ్రీనివాసరెడ్డి చనిపోయారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

error: Content is protected !!