News April 26, 2024
ఈనెల 29న చోడవరంలో సీఎం జగన్ బహిరంగ సభ

ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతున్నట్టు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 28న తాడిపత్రి నుంచి ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తారని, ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారన్నారు. 29న చోడవరంలో ఉదయం పది గంటలకు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారన్నారు.
Similar News
News April 24, 2025
సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం

కశ్మీర్ ఘటనలో మృతి చెందిన చంద్రమౌళికి ఘన నివాళి అర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్న ఆయన చంద్రమౌళికి నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో పాటు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, తదితరులు వీడ్కోలు పలికారు.
News April 23, 2025
చంద్రమౌళి మృతదేహానికి సీఎం నివాళి

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. ముందుగా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యలను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీఎంతో పాటు ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి, పలువురు కూటమి నాయకులు ఉన్నారు.
News April 23, 2025
విశాఖలో వైశ్యరాజు జువెలర్స్ షోరూం ప్రారంభం

విశాఖలోని ఆశీల్మెట్ట, సంపత్ వినాయక దరిలో వైశ్యరాజు జువెలర్స్ 18KT గోల్డ్ షోరూంను ప్రారంభించినట్లు MD వైశ్యరాజు తెలిపారు. వినయగర్ ప్యారడైజ్, భూస్వాములు లగడపాటి కిరణ్ కుమార్, మంత్రి శేషగిరిలు, నగేశ్లతో కలిసి షోరూంను ప్రారంభించారు. ఇండియాలో మొట్టమొదటి 18KT గోల్డ్ షోరూం ఇదేనని MD వైశ్యరాజు పేర్కొన్నారు. 18KT జువెలరీపై తరుగు(VA) 6% నుంచి ఉంటుందన్నారు. ఛైర్మన్ ఫల్గుణరాజు, డైరెక్టర్లు పాల్గొన్నారు.