News June 14, 2024
ఈనెల 29న జాతీయ లోక్ అదాలత్
జాతీయ లోక్ అదాలత్ను ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా వెల్లడించారు. జిల్లా కోర్టుతో పాటు ఆముదాలవలస, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, సోంపేట, టెక్కలి, కోటబొమ్మాలి, నరసన్నపేట, కొత్తూరు, పొందూరు, పాలకొండ, రాజాం కోర్టులలోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Similar News
News October 2, 2024
ఆమదాలవలస: మహాత్మా గాంధీ నాటిన మొక్క నేడు మహా వృక్షం
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మహాత్మా గాంధీ ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్కు 1942లో చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్లో దిగి సమరయోధులతో స్వాతంత్ర్య కాంక్షపై మాట్లాడారు. అనంతరం ఒక మర్రి మొక్కను నాటారు. నేడు అది మహావృక్షంగా మారింది. ఈ వృక్షానికి 82 ఏళ్లు వయసైందని దూసి గ్రామస్థులు చెబుతున్నారు.
News October 2, 2024
స్వర్ణాంధ్ర విజన్లో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్
స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పనలో ప్రజలందరూ భాగస్వాములై తమ అభిప్రాయాలను తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కోరారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికను రూపొందించడంలో రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా తొలిస్థానంలో నిలిచిందన్నారు. ఇంకా సమయం ఉన్నందున స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని అన్ని వర్గాలను కోరుతున్నట్లు చెప్పారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో మాట్లాడారు.
News October 1, 2024
శ్రీకాకుళం: మొదలైన మద్యం అమ్మకాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైన్ షాప్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మేన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో ఉదయం నుంచి సేల్స్ మాన్లు, సూపర్వైజర్లు మద్యం అమ్మకాలు చేపట్టకుండా సమ్మె చేశారు. జిల్లాలో 193 ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసిన సేల్స్ మెన్లు, సూపర్వైజర్ల కాంట్రాక్ట్ నిన్నటితో ముగిసింది. వీరితో చర్చించి 5వ తేదీ వరకు మద్యం అమ్మకాలు చేపట్టాలని సూచించడంతో 5గంటలనుంచి ప్రారంభించారు.