News April 12, 2025
ఉదయం 6 నుంచే పనిచేయండి: నారాయణ

మంత్రి నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లను ఉదయం 6 గంటలకే నిద్ర లేపుతున్నారు. అమరావతి నుంచి శనివారం ఉదయం 6 గంటలకు కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజామున పట్టణాల్లో పర్యటించాలని ఆదేశించారు. తానూ ఏదో ఒక మున్సిపాల్టీలో ఉదయం 6 గంటలకు పర్యటిస్తానని చెప్పారు.
Similar News
News April 13, 2025
నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం

ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యానంలో బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. 12, 13వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాకు మొదటి, పశ్చిమగోదావరి జిల్లాకు రెండవ, నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం వచ్చింది. రూ.5000 బహుమతి అందుకున్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు ఓబులం ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News April 13, 2025
రూ.2.7 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బొమ్మ నుంచి డైకాస్ రోడ్డు వరకు రూ.2.7 కోట్లతో సెంటర్ లైటింగ్, డివైడర్, ఫుట్ పాత్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గాంధీనగర్ రోడ్డును ఆదివారం పరిశీలించారు. గాంధీనగర్ రోడ్డుకు మహర్దశ పట్టిందని, త్వరలోనే అత్యంత సుందరంగా నిర్మిస్తామని ఆయన తెలిపారు.
News April 13, 2025
నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయులకు గమనిక

జోన్-3 పరిధిలోని ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 16లోగా తెలియజేయాలని నెల్లూరు డీఈఓ బాలాజీ రావు తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల పోస్టుల కొరకు జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యంతరాలను తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు.