News February 24, 2025

ఉప్పల్: పదవ తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

image

పదవ తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజనీరింగ్ విద్యను డిప్లమా లెవెల్లో అభ్యసించడం కోసం పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందు కోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచి విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు. 

Similar News

News February 24, 2025

నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల

image

ప్రధాని మోదీ నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన 19వ విడత కింద దేశంలోని రైతులకు రూ.22వేల కోట్ల నిధులను విడుదల చేస్తారు. రైతులకు ఏడాదిలో ఒక్కో విడతలో రూ.2వేలు చొప్పున 3 విడతల్లో కేంద్రం రూ.6వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 18 విడతల్లో రూ.3.46లక్షల కోట్లు చెల్లించారు.

News February 24, 2025

వికారాబాద్: ఆరు పాఠశాలల్లో ఏఐ విద్య: DEO

image

VKB జిల్లాలోని ఆరు పాఠశాలల్లో AI విద్యను అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టుగా 36 పాఠశాలల్లో అమలు చేస్తుండగా 6 పాఠశాలలు జిల్లాలో ఉన్నాయి. దోమ మండలంలోని బొంపల్లి, పరిగి మండలంలోని గడిసింగాపూర్, తాండూరులోని సాయిపూర్, కొడంగల్, కోట్పల్లి, VKB మండలంలోని పులుమద్ది పాఠశాలల్లో ఏఈ విద్యను అమలు చేయనున్నారు. ప్రతి ఒక్కరి కృషితో AI విద్యను అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు DEO తెలిపారు.

News February 24, 2025

గుండెపోటుతో ప్రభత్వ ఉపాధ్యాయుడు మృతి

image

గుండెపోటుతో ప్రభత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో జరిగింది. బోడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(60) ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లేందుకు బయలుదేరుతుండగా గుండెపోటు రావడంతో కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేశ్వర్లు(60) టేకులపల్లి మం. ఎర్రాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు.

error: Content is protected !!