News March 19, 2024
ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ VS ముంబై ఇండియన్స్

ఈనెల 27న HYD ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాచకొండ సీపీ తరుణ్ జోషి అధికారులతో ఈరోజు సమావేశమయ్యారు. స్టేడియం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ ఏరివేతకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
Similar News
News April 10, 2025
HYDలో ఒక్కసారిగా మారిన వాతావరణం

నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. నగరశివారుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. షాద్నగర్లో అయితే భారీ వర్షం కురిసింది. వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది. కామెంట్ చేయండి
PIC CRD: @prudhvikoppaka
News April 10, 2025
FLASH..శంషాబాద్లో ఫ్లైట్ దిగగానే మాజీ MLA అరెస్ట్

బోధన్ మాజీ MLA షకీల్ను శంషాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బేగంపేట్ ప్రగతి భవన్ వద్ద యాక్సిడెంట్లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.
News April 10, 2025
HYD: నా భార్యను ఎన్కౌంటర్ చేయండి: చెన్నయ్య

అమీన్పూర్లో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా తాను పిల్లల్ని బంగారంలా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని.. రజిత, ప్రియుడు శివను ఎన్కౌంటర్ చేయాలన్నారు.