News February 14, 2025
ఉప్పునుంతల: 21తేది నుంచి వెల్టుర్లో ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు

ఉప్పునుంతల మండలంలోని వెల్టుర్ గ్రామంలో ఈనెల 21తేది నుంచి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు నర్సయ్య, దుర్గయ్య, బాల్ చంద్రి, నిరంజన్, లక్ష్మయ్య తెలిపారు. ఉత్సవాలలో భాగంగా 25తేదీన అమ్మవారి కళ్యాణం, 26 తేదీన బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరారు.
Similar News
News February 21, 2025
HYD: ముస్లింలపై సీఎంది సవతి తల్లి ప్రేమ: ఉల్లాఖాన్

రంజాన్ పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదని మజ్లీస్ బచావో తారిక్ పార్టీ చీఫ్ అంజాద్ ఉల్లాఖాన్ ప్రశ్నించారు. గురువారం HYDలో మాట్లాడుతూ.. హిందూ పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే సీఎం రేవంత్ రెడ్డి.. ముస్లిం పండుగలపై ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ముస్లిం సంస్థలను సమావేశానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నిం
News February 21, 2025
HYD: ముస్లింలపై సీఎంది సవతి తల్లి ప్రేమ: ఉల్లాఖాన్

రంజాన్ పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదని మజ్లీస్ బచావో తారిక్ పార్టీ చీఫ్ అంజాద్ ఉల్లాఖాన్ ప్రశ్నించారు. గురువారం HYDలో మాట్లాడుతూ.. హిందూ పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే సీఎం రేవంత్ రెడ్డి.. ముస్లిం పండుగలపై ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ముస్లిం సంస్థలను సమావేశానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
News February 21, 2025
NLG: ‘ఈసారి ఓవర్ లోడ్ సమస్యలే లేవు’

వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ పంపిణి సంస్థ సీఎండి ముషారఫ్ ఫరూకీ ఆదేశించారు. గురువారం ఆయన NLG కలెక్టర్ కలెక్టరేట్లో విద్యుత్ సరఫరాకు సంబంధించి “వేసవి కార్యాచరణ ప్రణాళిక” పై సమీక్ష నిర్వహించారు. గతేడాది FEB 20 నాటికి జిల్లాలో 66 సబ్ స్టేషన్లపై ఓవర్ లోడ్ ఉండేదని.. ఈసారి ఒక సబ్ స్టేషన్లో కూడా ఓవర్ లోడ్ లేదని తెలిపారు.