News January 30, 2025
ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి: CM

ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని CM రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతికుమారితో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాలకు భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు చేయాలన్నారు.
Similar News
News February 21, 2025
ఇంద్రవెల్లి: నాలుగు వైన్స్ల్లో చోరీ

ఇంద్రవెల్లి ఏజెన్సీ ప్రాంతంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం రోజుల క్రితం నార్నూరులోని వ్యాపారి ఇంట్లో, వైన్ షాపులో చోరీ జరగింది. అది మరవకముందే గురువారం రాత్రి ఉట్నూర్ ఎక్స్ రోడ్, లోకారి, ఈశ్వర్ నగర్ వైన్ షాపుల్లో దొంగతనం జరిగింది. శుక్రవారం ఉదయం వైన్ షాపు యజమానులు చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు.
News February 21, 2025
ఆదిలాబాద్లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,940గా నిర్ణయించారు. సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం ప్రైవేట్ పత్తి ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News February 21, 2025
ADB: రైల్వే స్టేషన్లో తల్లీకూతుర్లు మిస్సింగ్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గౌరాపూర్కు చెందిన సక్రి అశ్విని అదృశ్యమైనట్లు 2 టౌన్ ఎస్ఐ విష్ణుప్రకాశ్ తెలిపారు. బుధవారం ఇంద్రవెల్లి నుంచి మహారాష్ట్రలోని పూణేకు వెళ్లేందుకు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. వారందరు రైలు ఎక్కగా, ఆమెతో పాటు కుమార్తె పియు కనిపించకుండా పోయారు. దీంతో భర్త గోరక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.