News February 6, 2025
ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.
Similar News
News December 20, 2025
ధనుర్మాసం: ఐదోరోజు కీర్తన

మధురా నగరంలో, యమునా తీరంలో జన్మించిన కృష్ణుడు అద్భుత గుణాలు కలవాడు. గొల్ల కులాన్ని తన రాకతో ప్రకాశింపజేశాడు. యశోద గర్భానికి వెలుగునిచ్చిన ఆయనను మనం పవిత్రమైన మనసుతో శరణు వేడాలి. ఏ కోరికలు కోరక స్వామిని భక్తితో పూజించాలి. ఆయన కల్యాణ గుణాలను గానం చేయాలి. ఫలితంగా మన పాపాలు పోతాయి. రాబోవు దోషాలన్నీ అగ్నిలో పడిన దూదిలా భస్మమవుతాయి. సర్వపాప హరుడైన ఆ పరమాత్మ నామస్మరణను ఎప్పుడూ మరువకూడదు. <<-se>>#DHANURMASAM<<>>
News December 20, 2025
మెదక్: నాడు తండ్రి.. నేడు కొడుకు సర్పంచ్

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో నాడు తండ్రి సర్పంచ్ కాగా.. నేడు తనయుడు సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్గా కందాల రాజ నర్సింహా విజయం సాధించగా ఆయన తండ్రి కందాల సాయిలు గతంలో ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచారు.
News December 20, 2025
జోనర్లు మార్చుకుంటున్న రవితేజ

గతంలో వరుసగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ప్రస్తుతం తన పంథా మార్చారు. ఇటీవల ఒక్కో సినిమాకు ఒక్కో జోనర్ సెలక్ట్ చేసుకొని అలరిస్తున్నారు. ధమాకాతో మాస్, రావణాసురతో థ్రిల్లర్కు ఓటేసిన ఆయన టైగర్ నాగేశ్వరరావుతో పీరియాడిక్ డ్రామా ఎంచుకున్నారు. త్వరలో అనుదీప్తో కామెడీకి సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి ఫ్యామిలీ డ్రామా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో వస్తున్నారు. ఈ మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.


