News April 20, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ మల్లాపూర్ మండలంలో ప్రమాదవశాత్తు ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం. @ రాయికల్ మండలంలో అనారోగ్యంతో స్వర్ణకారుడి ఆత్మహత్య. @ కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 22 నుండి 24 వరకు అర్జిత సేవలు రద్దు. @ మెట్పల్లి మండలంలో పిడుగు పడి ఒకరికి తీవ్ర గాయాలు. @ మల్లాపూర్ మండలంలోని చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కోరుట్లలో వైభవంగా వీర హనుమాన్ విజయ యాత్ర.
Similar News
News October 8, 2024
జగిత్యాల: ఉపాధి కల్పనకు కసరత్తు
ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ కూలీలకు చేతినిండా పని కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. వచ్చే నెలలో మండలాల వారిగా ప్రణాళికలు ఖరారు చేయనున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల జాబ్ కార్డుల పరిధిలో 2.73 లక్షల మంది కూలీలు ఉన్నారు.
News October 8, 2024
సిరిసిల్ల: పత్తి కొనుగోలు కేంద్రాలకు మౌలిక వసతుల కల్పన
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో వచ్చే పత్తి పంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కలెక్టరేట్లో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్ను అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు.
News October 8, 2024
పెద్దపల్లి: రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేసిన ఎంపీ
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, ఓదెల రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, రెచ్నిలలో కొత్త రైళ్ల ప్రారంభం, పాత రైళ్ల పునరుద్ధరణ అభివృద్ధి కోసం నేడు పెద్దపెల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రైల్వే ప్రయాణం అందించడం కొరకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.