News March 20, 2025
ఉమ్మడి కరీంనగర్: బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-2026 ఏడాదికి 6,7,8,9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. http://www.mjptbcadmissions.org లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి. సైదులు తెలిపారు. ఎప్రిల్ 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మొత్తం 6,832 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామన్నారు.
Similar News
News March 21, 2025
ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబుది కీలకపాత్ర: మందకృష్ణ

AP: SC వర్గీకరణపై APఅసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణలో CM చంద్రబాబు పాత్ర కీలకమని పేర్కొన్నారు. ‘1997-98లోనే వర్గీకరణపై చంద్రబాబు తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆయన న్యాయం వైపే ఉన్నారు. జగన్ ఉంటే వర్గీకరణ జరిగేది కాదు. మోదీ, అమిత్ షా, వెంకయ్య, కిషన్ రెడ్డి, పవన్ అండగా నిలిచారు’ అని వ్యాఖ్యానించారు.
News March 21, 2025
నిర్మల్: పది పరీక్షకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 9,115 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News March 21, 2025
ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలి: కలెక్టర్

నర్సింగ్ విద్యార్థులకు తరగతులు నిర్వహణకు తాత్కాలికంగా ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో వైద్య, నర్సింగ్, ఆయుష్, సీహెచ్సీ, టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు .కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ భవనంలోని రెండు అంతస్థులను నర్సింగ్ కళాశాల నిర్వహణకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు.