News February 1, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించండి:ఎంపీ

image

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు MP రఘురాంరెడ్డి తెలిపారు. KTDMఎయిర్‌పోర్ట్, భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్‌, KMM-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, KMM- VJD హైవేకు నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. KTDM కలెక్టరేట్‌ వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్, కిన్నెరసానిపై రెండో వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.

Similar News

News February 1, 2025

BUDGET 2025: రైతులకు మరో గుడ్‌న్యూస్

image

రైతులకు నిర్మలా సీతారామన్ మరో గుడ్‌న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డుల (KCC) రుణ పరిమితిని రూ.3లక్షల నుంచి రూ.5Lకు పెంచుతున్నామని ప్రకటించారు. ఈ కార్డులతో లభించే స్వల్పకాల రుణాలతో 7.7 కోట్ల మంది రైతులు, జాలరులు, పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలపై మాట్లాడారు.

News February 1, 2025

మెదక్: అయ్యో పాపం.. కాలు తీసేశారు..!

image

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో రెండురోజుల క్రితం <<15308889>>ఉపాధి హామీ<<>> కూలీలపై మట్టి పెళ్లలు పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలయిన ఇంద్రాల స్వరూప కాలు నుజ్జు నుజ్జు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు ఆమె కాలును తొలగించారు. ఈ సంఘటనలో తల్లి కూతుర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకొని ఇంటికి వస్తుందని అనుకున్న స్వరూప కాలు తీసేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

News February 1, 2025

విశాఖ: తల్లిని చంపి రూమ్‌‌కి తాళం వేసిన కొడుకు

image

విశాఖలో కన్న కొడుకే తల్లిని <<15319558>>హత్య<<>>చేసిన విషయం తెలిసిందే. ఎవరూ లేని సమయంలో తల్లిపై కత్తితో దాడి చేయగా ఆమె చనిపోయింది. తల్లిని రూమ్‌లో పెట్టి తాళం వేశాడు. ఇంటికి వచ్చిన తమ్ముడు తల్లి గురించి అడగ్గా ఇంట్లో లేదని సమాధానం ఇచ్చాడు. చిన్నకొడుకు తండ్రికి ఫోన్ చేసి చెప్పగా కోస్ట్ గార్డులను ఇంటికి పంపించాడు. వారు వెతకగా అల్కాసింగ్ రక్తపు మడుగులో పడి ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.