News April 15, 2025

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 249 పోస్టులు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 249 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 151 SGT(ప్రాథమిక స్థాయి), 98 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Similar News

News April 19, 2025

విచారణకు హాజరైన మిథున్ రెడ్డి

image

AP: మద్యం కేసులో విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.

News April 19, 2025

జనగామ జిల్లా చరిత్ర, ప్రత్యేకతలు ఇవే!

image

జనగామ జిల్లాకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది 11వ శతాబ్దంలో కల్యాణి చాళుక్యుల 2వ రాజధానిగా నిలిచింది. 1195-1323 వరకు కాకతీయుల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. జనగామలో జైన తీర్థంకరుల శిల్పాలు కనుగొనబడ్డాయి. ఇది మేఘాలిథిక్ యుగంలో జైనిజం ప్రాచుర్యాన్ని సూచిస్తుంది. కాగా, జిల్లాలో జీడికల్ రామచంద్ర స్వామి, పాలకుర్తి సోమేశ్వరాలయాలు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. మీది ఏమండలం? మీ గ్రామ ప్రత్యేకత కామెంట్ చేయండి.

News April 19, 2025

పెద్దపల్లిలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

image

పెద్దపల్లి జిల్లాలో అంతర్రాష్ట్ర ATM దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీపీ కరుణాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దొంగలు రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములుగా గుర్తించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు నిఘా పెంచి గాలించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

error: Content is protected !!