News October 3, 2024

ఉమ్మడి జిల్లాలో దేవీ నవరాత్రుల సందడి

image

నేటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి మందిరంలో అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. దసరా వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక్కడి అమ్మవారు భక్తుల కోరికలు నెరవేర్చే తల్లిగా విరాజిల్లుతున్నారు.

Similar News

News October 3, 2024

NZB: ‘ఈనెల 5లోగా DSC సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయండి’

image

డీఎస్సీ ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ ప్రకారం 1:3 నిష్పత్తిలో చేపడుతున్న సర్టిఫికెట్ల పరిశీలనను ఈనెల 5లోగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. ఈనెల 9న హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.

News October 3, 2024

బిక్కనూర్: భార్య పుట్టింటి నుంచి రావడం లేదని వ్యక్తి ఆత్మహత్య

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌కి చెందిన గంధం కేశయ్య (40) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల కేశయ్య తన భార్య, కుతూరుతో గొడవపడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి తిరిగిరాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన భార్యా కాపురానికి రాకపోవటంతో మనస్థాపం చెందిన కేశయ్య.. గురువారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రామచందర్ నాయక్ తెలిపారు.

News October 3, 2024

కామారెడ్డిలో డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 133 మంది హాజరు

image

డీఎస్సీ-2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొదటిరోజు 133 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. నిన్న అమావాస్య కావడంతో తక్కువ మంది ధ్రువపత్రాల పరిశీలకు వచ్చినట్లు సిబ్బంది వెల్లడించారు. అలాగే ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని అధికారులు సూచించారు.