News March 20, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✔కొత్తూరు: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
✔MBNR:కాంగ్రెస్‌లో చేరిన జడ్పీ ఛైర్‌పర్సన్,పలు నేతలు
✔నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇవ్వాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✔MBNR:BJPలో చేరిన పలువురు నేతలు
✔GDWL:MRO ఆఫీసులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
✔కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు: మంత్రి జూపల్లి
✔NGKL: చేపల వేట.. రెండు గ్రామాల మధ్య గొడవ
✔ఉమ్మడి జిల్లాలో ఉపాధిహామీ పథకంపై అధికారుల ఫోకస్

Similar News

News April 11, 2025

దేవరకద్ర: తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతన్నలు

image

దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు నిమిత్తం మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. కాగా గురవారం కురిసిన వర్షంతో ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

News April 11, 2025

బాలానగర్: బావిలో దూసి మహిళ SUICIDE

image

బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుంది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. లింగారం గ్రామానికి జంగమ్మ (35)కు కల్లు తాగే అలవాటు ఉండగా ఆమెను భర్త మందలించాడు. మనస్థాపానికి గురైనా ఆమె అందరూ గాఢ నిద్రలో ఉండగా.. గురువారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

News April 11, 2025

ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహశీల్దార్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మఇంటి నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి తహశీల్దార్లకు పంపించాలన్నారు. 

error: Content is protected !!