News July 21, 2024
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైరల్ ఫియర్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యాధులు ముసుకురుకుంటున్నాయి. కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు, వీధుల్లో మురుగు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలతో సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఎక్కడ చూసినా ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. జ్వరాల బారిన పడి ప్రజలు ఆసుపత్రులపాలవుతున్నారు.
Similar News
News October 1, 2024
NLG: లా పరీక్షలు వాయిదా
న్యాయశాస్త్రం 3, 5 సంవత్సరాల కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను వాయి దా వేస్తున్నట్లు నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల కన్వీనర్ ఉపేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. .
News October 1, 2024
ఆ బాధ్యత అధికారులపై ఉంది : కలెక్టర్
గ్రామాలలో ప్రజలకు రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంస్థల నిర్వహణపై చేయాల్సిన బాధ్యత జిల్లా స్థాయి మొదలుకొని, గ్రామ స్థాయి అధికారుల వరకు ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
News September 30, 2024
నల్గొండ: ఏసీబీకి చిక్కిన పశు వైద్యాధికారి
చింతపల్లి మండల పశు వైద్యాధికారి జోసఫ్ పాల్ రూ.6,000 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గేదెల బ్యాంకు లోన్, హెల్త్ సర్టిఫికెట్ కోసం నసర్లపల్లికి చెందిన ఓ రైతు వద్ద రూ.8వేలు డిమాండ్ చేసి రూ.6 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్ కి ఫోన్ చేయాలని ఉమ్మడి ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు.