News October 15, 2024

ఉమ్మడి ప.గో జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

image

ఉమ్మడి ప.గో జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప.గో జిల్లాకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను నియమించారు. అలాగే ఏలూరు జిల్లాకు మంత్రి నాదెండ్ల నియమితులయ్యారు. వారు జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యకలాపాలలో భాగస్వాములు కానున్నారు.

Similar News

News October 15, 2024

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో ఉండి ఎమ్మెల్యే

image

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో దిగిన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి-2898AD చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో అశ్వథ్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News October 15, 2024

పట్టభద్రుల స్థానాన్ని ఐక్యంగా పోరాడి గెలిపించాలి: మంత్రి నిమ్మల

image

ఉమ్మడి తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సీ స్థానాన్ని కూటమి నేతలు ఐక్యంగా పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. రాజమండ్రిలో పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు, సన్నాహ కార్యక్రమం లో భాగంగా ఎన్డీయే పార్టీ నేతల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సమావేశానికి టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

News October 15, 2024

ఏలూరు జిల్లాలో 12 మంది మహిళలకు వైన్ షాపులు

image

ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన మద్యం దుకాణాల లాటరీ విధానంలో పలువురు మహిళలు దుకాణాలను దక్కించుకున్నారు. జిల్లాలో 144 మద్యం దుకాణాలకు 5,499 మంది టెండర్లు దాఖలు చేయగా, 144 మద్యం షాపులకు లక్కీడిప్‌ ద్వారా 144 మందిని ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. అయితే వీరిలో 12 మంది మహిళలు మద్యం దుకాణాలను లాటరీ విధానంలో కైవసం చేసుకున్నారు.