News March 22, 2025

ఎంఎంటీఎస్ కోసం వేయికళ్లతో ఎదురుచూపు..!

image

వికారాబాద్ జిల్లా ప్రజలు MMTS రైలు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు జిల్లా నుంచి సుమారుగా 10 – 12 వేల మంది ప్రయాణికులు HYDకు వెళ్లి వస్తున్నారు. కొన్నేళ్లుగా VKB రైల్వే స్టేషన్ జంక్షన్‌గా కొనసాగుతుంది. కాగా MMTS సర్వీస్ ప్రస్తుతం లింగంపల్లి వరకే ఉంది. కావున MMTS సర్వీస్‌ను VKB వరకు పొడిగిస్తే జిల్లా ప్రజలకు ఎంతగానో మేలవుతుంది. ప్రభుత్వం ఇందుకు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Similar News

News March 25, 2025

భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

image

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం మంగళవారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి, భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు ఉన్నారు.

News March 25, 2025

ఈసారైనా రామకుప్పం ఎంపీపీ ఎన్నిక జరిగేనా?

image

రామకుప్పం మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఎంపీపీ ఎన్నిక 5 సార్లు వాయిదా పడింది. మొత్తం 15 మంది MPTCలకు గాను వైసీపీకి చెందిన సుమారు 7 మంది ఎంపీటీసీలు టీడీపీ కండువా కప్పుకున్నారు. కాగా ఈ ఎన్నికను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. వైస్ ఎంపీపీ పదవికి ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ఈసారైనా ఎన్నిక జరుగుతుందా లేదా వేచి చూడాల్సిందే.

News March 25, 2025

ఈ నెలాఖరుతో ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తి: జేసీ

image

గతేడాది ఖరీఫ్‌కు సంబంధించి చేపట్టిన ధాన్యం సేకరణ ఈ నెలాఖరుతో ముగుస్తుందని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 7,893 మంది రైతుల నుంచి 25,372.88 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఆయా రైతులకు రూ.58.147 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. ఖరీఫ్‌లో పండిన ధాన్యం సేకరణను ఈనెల 31వ తేదీతో ముగించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

error: Content is protected !!