News April 7, 2025
ఎండలతో జాగ్రత్త!

శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుంచి క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో తరచూ నీరు తాగాలని అన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News April 18, 2025
NZB: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఆర్టీసీ బస్సుల రాకపోకల వివరాల కోసం ప్రత్యేకంగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిజామాబాద్ రీజియన్లో ఆర్టీసీ ప్రయాణికులు బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం జ్యోత్స్న పేర్కొన్నారు. ఆర్మూర్-73828 43133, నిజామాబాద్-99592 26022, కామారెడ్డి-73828 43747, బోధన్-98495 00725, బాన్సువాడ-94911 05706 నంబర్లకు ఫోన్చేసి బస్సుల వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
News April 18, 2025
MHBD: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన తహశీల్దార్ల సంఘం

మరిపెడ, చిన్నగూడురులో ఏర్పాటు చేసిన సదస్సుల్లో డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ స్థానిక తహశీల్దార్లపై ఇసుక అనుమతుల విషయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను మహబూబాబాద్ జిల్లా తెలంగాణా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ & తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖండించారు. G.O.Ms.No.3, G.O.Ms.No.15 ప్రకారం మాత్రమే తహశీల్దార్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉందని, ప్రత్యేక అధికారం లేదన్నారు.
News April 18, 2025
తరచూ జలుబు వేధిస్తోందా?

సీజన్లతో సంబంధం లేకుండా కొందరిని తరచూ జలుబు వేధిస్తుంటుంది. దీనికి శరీరంలో అయోడిన్ లోపం కారణమై ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో మాటిమాటికీ వచ్చే ఆవలింతలకు కారణం ఐరన్ లోపం అని అంటున్నారు. అలాగే, కాళ్లు, చేతుల కండరాల్లో రెగ్యులర్గా నొప్పులు వస్తుంటే శరీరంలో మెగ్నీషియం తక్కువైందని గుర్తించాలంటున్నారు. వెన్ను, కాళ్ల నొప్పులొస్తే విటమిన్-D టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.